తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే

 



హైదరాబాద్ : (ధర్మఘంట) ట్రూ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే మహిళా సంఘాల్లోని మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. అభయహస్తం పథకంలోని రూ.385 కోట్ల నిధులను మహిళలకు తిరిగివ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకంలో భాగంగా మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఆరేళ్లపాటు చెల్లించారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు తమ డబ్బులు పొదుపు చేసుకున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. ఈ నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించినట్లు రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. 2022 నాటికి ఆ డబ్బులు వడ్డీతో కలిపి రూ.545 కోట్లకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు వీటిని తిరిగి మహిళలకుహిళా సంఘాలకు సోలార్ ఫ్లాంట్లు.. ఇక తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సబ్సిడీపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక అప్డేట్ ఇచ్చారు. వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంట్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేయనున్నట్లు చెప్పారు. టెండర్లు పూర్తయ్యేనాటికి సంఘాలను గుర్తించి నిర్ధారించడం, భూసేకరణ, బ్యాంకుల నుంచి అవసరమైన ఆర్థికసాయం వంటి పనులను రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు.ఎస్‌హెచ్‌జీల ద్వారా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు దేవాదాయ, నీటిపారుదలశాఖల పరిధిలోని భూములను గుర్తించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని 6.67 లక్షల ఎకరాలను ఇంతవరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేసిందని చెప్పారు. అయితే ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడం లేదని వెల్లడించారు. అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగుచేస్తే వారికి మేలు జరుగుతుందన్నారు. అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతమవుతారని చెప్పారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.