జన్యుపరమైన, డీఎన్ఏ టెస్టులు కూడా నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎంతో ప్రయోజనకరమన్నారు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ పరిశోధన కేంద్రం ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం బాగుంటుంది, అన్ని వాతావరణాలను తట్టుకుని మంచి దిగుబదులనిచ్చే విత్తనం రైతులకు అందించాలని రాష్ట్రంలో అతిపెద్ద వైయస్సార్ విత్తన పరిశోధన శిక్షణ కేంద్రాన్ని 46 కోట్లతో 8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు రైతుల సంక్షేమానికి రైతు భరోసా వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతులకు అండగా వారి ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రి జగనన్నకు రైతులు అండగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ సభకు అధ్యక్షత వహించారు..
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం వి ఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎండి శేఖర్ బాబు, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జే.రాఘవరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.