అ'స్పిన్‌' మాయాజాలం.. టీమ్‌ఇండియాకు ఇన్నింగ్స్‌ విజయం

 నాగ్‌పూర్‌: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.



 321/7 (తొలి ఇన్నింగ్స్‌) ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌.. మరో 79 పరుగులు జోడించి 400 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కంగారుల జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే తోకముడిచింది.

తొలి ఇన్నింగ్స్‌లో (3/42)తో ఆకట్టుకున్న అశ్విన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో (5/37).. తన స్పిన్‌ మాయాజాలంతో ఆసీస్‌ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో (5/47)తో అదరగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 16 వికెట్లు పడగొట్టారు.



ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా రవీంద్ర జడేజా

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టడంతోపాటు 70 పరుగులు బాది జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రోహిత్‌ శర్మ (120; 212 బంతుల్లో 15×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (84) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.



తిప్పేసిన స్పిన్నర్లు

ప్రాక్టీస్ కు పచ్చిక పిచ్ లు ఇచ్చి అసలు మ్యాచ్ కు వచ్చేసరికి స్పిన్ పిచ్ లు ఇస్తారని ప్రాక్టీస్ మ్యాచ్ లు వద్దనుకున్నారు.

స్పిన్ ను దీటుగా ఎదుర్కోవడానికి నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. భారత్ ను మానసికంగా కుంగదీయడానికి కవ్వింపు మాటలు మాట్లాడారు. అయితే ఇవేవీ భారత్ విజయాన్ని ఆపలేకపోయాయి. ఆస్ట్రేలియా పరాజయాన్ని అడ్డుకోలేకపోయాయి. ప్రపంచాన్ని జయించినా భారత గడ్డపై గెలుపు అంత సులువు కాదంటూ మరోసారి నిరూపితమైన వేళ.. తొలి టెస్టులో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. స్పిన్ ఆడటంలో మరోసారి తమ బలహీనతను బయటపెట్టుకున్న కంగారూలు మూడో రోజుకే చాప చుట్టేశారు. భారత స్పిన్నర్లు విజృంభించిన వేళ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.



స్పిన్నర్లు తిప్పేసిన వేళ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం సాధించింది. 223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. అశ్విన్, జడేజా, అక్షర్ ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ఐదేసిన అశ్విన్

223 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఈ సిరీస్ ముందు వరకు సూపర్ ఫాంలో ఉన్న ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను స్లిప్ లో కోహ్లీ క్యాచ్ తో ఔట్ చేసిన అశ్విన్.. వికెట్ల పతనానికి తెరలేపాడు. ఆ తర్వాత ఏ దశలోనూ ఆస్ట్రేలియా కోలుకోలేదు. అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ క్యాచ్ జారవిడవటంతో బతికిపోయిన వార్నర్ అవకాశాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. 41 బంతుల్లో 10 పరుగులు చేసిన వార్నర్ అశ్విన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత లబూషేన్ (28 బంతుల్లో 17)ను జడేజా వెనక్కు పంపాడు. ఆ తర్వాతంతా అశ్విన్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా వికెట్లు పడగొట్టాడు. యాష్ ధాటికి రెన్ షా (7 బంతుల్లో 2), హ్యాండ్స్ కాంబ్ (6 బంతుల్లో 6), అలెక్స్ క్యారీ (6 బంతుల్లో 10) పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ 3 వికెట్లు ఎల్బీ రూపంలోనే రావడం గమనార్హం. ఆ తర్వాత మిగతా పనిని జడేజా, అక్షర్, షమీలు లు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 5, జడేజా 2, షమీ 2, అక్షర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.



రాణించిన బ్యాటర్లు

పేసర్లు ఆరంభించారు. బ్యాటర్లు రాణించారు. స్పిన్నర్లు చుట్టేశారు. ఇదీ తొలి టెస్టులో భారత్ ఆట సాగిన తీరు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 177 పరుగులకే ఆలౌట్ చేసింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, షమీలు తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఆసీస్ బ్యాటర్లలో లబూషేన్ (49), స్మిత్ (37), హ్యాండ్స్ కాంబ్ (31), అలెక్స్ క్యారీ (36) పరుగులతో రాణించారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 400 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో టీమిండియాకు 223 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్ (84), అశ్విన్ (70), షమీ (37) పరుగులతో ఆకట్టుకున్నారు.



రోహిత్ రికార్డ్

ఈరోజు సెంచరీతో రోహిత్ శర్మ పలు రికార్డులను చేరుకున్నాడు. రెండేళ్ల తర్వాత శతకం బాదిన హిట్ మ్యాన్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా కెప్టెన్ గా టీ20, వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో శతకాలు చేసిన మొదటి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.



భారీ సిక్సర్లతో చెలరేగిన షమీ.. ఆసీస్‌ టాప్‌ స్పిన్నర్‌కు చుక్కలు.. దెబ్బకు కోహ్లీ రికార్డు కూడా బద్దలు

ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ షమీ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. కేవలం 47 బంతుల్లోనే 37 రన్స్‌ సాధించాడు.


నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా  ఓవర్‌నైట్‌ స్కోరు 321/7 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌటైంది. తద్వారా మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రోహిత్‌ శర్మ(120) సెంచరీతో టాప్‌ స్కోరర్‌తో నిలవగా, జడేజా 70, అక్షర్‌ పటేల్‌ 84 పరుగులతో రాణించారు. ఆసీస్‌ స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ 124 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. 



కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్‌ ఆటగాడు మహ్మద్‌ షమీ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ..  కేవలం 47 బంతుల్లోనే 37 రన్స్‌ సాధించాడు. అతనిఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, రెండు ఫోర్లు ఉన్నాయి.  ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే   షమీ కొట్టిన మూడు సిక్స్‌ లు.. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన టాడ్‌ మర్ఫీకే బౌలింగ్‌లోనే. అంతేకాదు అక్షర్‌ పటేల్‌తో కలిసి షమీ కీలకమైన 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా ఈ మ్యాచ్‌ ద్వారా కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు మహ్మద్‌ షమీ.  భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ కంటే ముందు షమీ ఉండడం గమనార్హం. విరాట్ కోహ్లి ఇప్పటి వరకు 104 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 24 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. అదే సమయంలో షమీ ఇప్పటి వరకు 61 టెస్టు మ్యాచ్‌లు ఆడి, 25 సిక్సర్లు బాదాడు. నాగ్‌పూర్ టెస్టుకు ముందు షమీ కెరీర్‌లో 22 సిక్సర్లు ఉండగా.. ఈ మ్యాచ్లో ఏకంగా 3 సిక్సర్లు కొట్టేశాడు. తద్వారా కోహ్లీ రికార్డును కొల్లగొట్టాడు. కాగా టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరు మీద ఉంది. అతని కెరీర్‌ లో మొత్తం 91 సిక్సర్లు ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 



కాగా షమీ సంచలన ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి