హైదరాబాద్: తెలంగాణ కరోనా బులెటిన్ విడుదలైంది. కొత్తగా 1597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39, 342 కి చేరింది. కరోనాతో ఇప్పటివరకూ కోలుకుని 25, 999 మంది డిశ్చార్జ్ కాగా 386 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12, 958 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. బుధవారం కరోనాతో 11 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు:
హైదరాబాద్ 796, రంగారెడ్డి 212, మేడ్చల్ 115, సంగారెడ్డి 73, ఖమ్మం 6, కామారెడ్డి 30, వరంగల్ అర్బన్ 44, కరీంనగర్ 41, యాదాద్రి 13, మహబూబాబాద్ 5, పెద్దపల్లి 20, మెదక్ 18, మహబూబ్ నగర్ 21, మంచిర్యాల 26, భద్రాది 7, భూపాలపల్లి 15, నల్లగొండ 58, సిరిసిల్ల 6, ఆదిలాబాద్ 1, నారాయణపేట 5, వికారాబాద్ 5, నాగర్ కర్నూలు 5, జనగాం 8, నిజామాబాద్ 13, ములుగు 4, వనపర్తి 5, సిద్దిపేట 27, సూర్యాపేట 14, గద్వాలలో 4 కేసులు నమోదయ్యాయి.