న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచ దేశాలకు అండగా నిలిచిందని, 150 దేశాలకు మందులు, వైద్య సామాగ్రిని అందించిందని మోదీ చెప్పారు. కరోనాపై పోరును భారత్ ప్రజా ఉధ్యమంగా మార్చిందన్నారు. 2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లుండాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని చెప్పారు. అందరితో కలిసి అందరి అభివృద్ధి అనే నినాదంతో పనిచేస్తున్నామన్నారు. మిగతా దేశాలు కూడా భారత్ లాగే సుస్థిర అభివృద్ధి సాదించేందుకు తమ ప్రభుత్వం దోహదపడుతుందని మోదీ చెప్పారు.
ఐక్యరాజ్య సమితితో పాటు ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలికి భారత్ ఎప్పుడూ అండగా నిలిచిందని మోదీ చెప్పారు.
ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలికి 1946 లో రామస్వామి మొదలియార్ అధ్యక్షత వహించారని మోదీ గుర్తు చేశారు.