హైదరాబాద్: తెలంగాణ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 1478 కొత్త కేసులు వెలుగుచూశాయి. వీటిలో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 806 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. తాజా గతకాలంలో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 43, 496 కి చేరగా...ప్రస్తుతం 13, 389 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారితో ఇవాళ ఏడుగురు మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 403 కి చేరింది. రాష్ట్రంలో 28,705 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,37,817 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ లో పేర్కొంది.