తెలంగాణ లో ఇవాళ ఒక్కరోజే 1278 కరోనా కేసులు నమోదు


హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణ లో రోజురోజుకూ విస్తరిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1278 కేసులు నమోదయ్యాయి. ఇవాళ 8 మంది కరోనాతో మరణించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 32,224 కు చేరుకుంది. గత కొన్నిరోజులుగా రోజూ వెయ్యికిపైగానే కేసులు నమోడవుతుండటం గమనార్హం. కేసులు పెరిగిపోతుండటంతో  రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో ఇవాళ 762 కేసులు నమోదయ్యాయి. మునుపటితో పోలిస్తే నగరంలో ఇవాళ తక్కువ కేసులే నమోదయ్యాయి.


రంగారెడ్డిలో 171, మేడ్చల్ లో 85 కేసులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1278 కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటివరకూ మొత్తం 399 మంది కరోనాతో చనిపోయారు. ఓ వైపు పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం...


మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ అటుంచితే... కేసీఆర్ సర్కార్ టెస్టులు సరిగ్గా చేయలేదని...టెస్టుల సంఖ్య పెంచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.