హైదరాబాద్: తెలంగాణ లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,269 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,671 కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,563 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా...కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,482 కు చేరింది.
కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 356 కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,883 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 8,153 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా....అందులో 6,884 మందికి కరోనా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 800, రంగారెడ్డి లో 132, మేడ్చల్ 94 కేసులు నమోదయ్యాయి.