భారత్, చైనా కమాండర్ స్థాయి చర్చలు సఫలం అయ్యాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా దేశాలు చర్యలు చేపట్టాయి. దీంతో వివాదాస్పద ప్రాంతంలో బలగాలను వెనక్కితీసుకోవడానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి. దీంతో త్వరలోనే బలగాల ఉపసంహరణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్మీ చీఫ్ నరవనే లడక్ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గాల్వాన్ ఘటనలో గాయపడ్డ జవాన్లను పరామర్శించనున్నారు.
భారత్, చైనా కమాండర్ స్థాయి చర్చలు సఫలం