రానున్న ఎన్నికల్లో తాను ఓడిపోతే... అది దేశానికి మంచి కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజా నాడీ తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ట్రంప్ ఘోరంగా ఒడిపోతారని తెలిపింది. దీనికి కారణాలుగా కరోనా వైరస్ వలన పెరిగిన నిరుద్యోగ రేటు, కుదేలైన ఆర్థిక వ్యవస్థలను చూపించింది. ట్రంప్ కు 35శాతం ఓట్లు మాత్రమే పడతాయని చెప్పింది. అయితే, దీనిపై స్పందించిన ట్రంప్ నిజంగా నేను ఓడిపోతే.... వేరేపనులు చేసుకుంటానని అన్నారు. అయితే, నల్లజాతీయుడు హత్యతో ట్రంప్ సర్కారు కు వ్యతిరేకంగా అమెరికాలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ విషయంపై స్పందించిన ట్రంప్ అబ్రహం లింక్ తరువాత..
నల్లజాతీయులకు ఎక్కువ మేలు చేసింది తానేనని చెప్పుకొచ్చారు. నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసింది. ట్రంప్ పై డెమొక్రటిక్ పార్టీ తరుపున ఓ బిడెన్ పోటీ చేస్తున్నారు.