హైదరాబాద్ : అనేక దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని సడలింపులు ఇస్తుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మహమ్మారి ఇప్పట్లో పోయేదికాదని, సడలింపులు ఇచ్చినా ప్రజలు తమ జాగ్రత్త తాము చూసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. యూరప్ దేశాల్లోనే కాకుండా ఇతర ఖండాల్లోనూ అనేక దేశాల్లో భౌతికదూరం సహా అనేక అంశాల్లో సడలింపులు ఇస్తుండడంతో ఈ వైరస్ ప్రభావం పోయిందన్న భావన ప్రజల్లో కలుగుతోందని డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హ్యారిస్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వైరస్ ఎక్కడికి పోలేదని, ప్రపంచంలో ఎక్కడా ఈ వైరస్ లేదు అనేంతవరకు దీన్ని ఓ ముప్పుగానే పరిగణించాలని పేర్కొన్నారు.
వైరస్ ఇప్పట్లో పోయేది కాదు..