తెలంగాణలో విజృంభించిన కరోనా... మంగళవారం ఒక్కరోజే...


హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం ఒక్కరోజే 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. ఇప్పట్టివరకు 3,920 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మంగళవారం జీహెచ్ఎంసీలో 143, రంగారెడ్డి లో 15, మేడ్చల్ లో 10, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్ లో రెండేసి, జగిత్యాల, కొమురం భీమ్, సిరిసిల్ల, వరంగల్ రూరల్ లో ఒక్కో కేసు నమోదు అయింది. ఇప్పటివరకు 1,742 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 2,030 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణ లో ఇప్పటివరకు కరోనా తో 148 మంది మృతి చెందారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.


కాగా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ను బట్టి ఆందోళన కలిగిస్తున్నాయి.


లాక్ డౌన్ సడలింపుతో కరోనా ఒక్కసారిగా విజృంభించింది. దీంతో రోజు రోజుకు కరోనా బారిన పడే వారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. వారం నుంచి అయితే మరీ ఘోరంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో అయితే పాజిటివ్ నిర్ధారణ కేసులు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఎప్పుడు ఎవరి వల్ల కరోనా సోకుతుందోనన్న భయం ప్రజల్లో కలుగుతుంది.