రేపు నర్సా పూర్ కు సీఎం కేసీఆర్


నర్సా పూర్: ఆరో విడత హరితహారం సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం మెదక్ జిల్లా నర్సా పూర్ చేరుకోనున్నారు. మెదక్ జిల్లా నర్సా పూర్ నుంచే హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటి, హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి , మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, కలెక్టర్ ధర్మా రెడ్డి, ఎస్పీ ,    డీఎఫ్ఓలు పాల్గొన్నారు.