తొలి ఎలక్ట్రిక్‌ విమాన ఎగిరింది


వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం ప్రయోగం విజయవంతమైంది. ఈ సాంకేతిక యుగంలో ఆవిష్కరించిన తొలి భారీ ఎలక్ట్రికల్ విమానం వాషింగ్టన్ నుంచి ఆకాశంలో తొలిసారి విజయవంతంగా ఎగిరింది. దాదాపు30 నిమిషాల పాటు ప్రయాణించింది. సెస్న్నా -208 క్యారవాన్ అనే ఈ విమానాన్ని పూర్తి ఎలక్ట్రికల్ ఇంజన్ తో తొమ్మిది మంది ప్రయాణికులు కూర్చునే విధంగా అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్ అనే సంస్థ తయారు చేసిన విషయం తెలిసిందే. దీనిలో 750 హెచ్ పీ సామర్థ్యం కలిగిన మోటార్ ను అమర్చారు. అయితే, ఈ విమానం మోసెస్ సరస్సు వద్ద ల్యాండ్ అయ్యే ముందు  దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో ఎగిరిందని మాగ్ని ఎక్స్ సంస్థ తెలిపింది. కానీ, ఈ ప్రయోగ సమయంలో మాత్రం ఒక్క పైలట్ మాత్రమే గంటకు 183 కి. మీ. ల వేగంతో దీనిలో ప్రయాణం చేశారని తెలిపింది. 2021 నాటికి ఈ విమానం కమర్షియల్ సర్వీసులను అందుబాటులోకి తేవాలని మాగ్ని ఎక్స్ సంస్థ భావిస్తోంది. వాషింగ్టన్ నగరం రెడ్మాండ్ లోని మాగ్ని ఎక్స్ అనే స్టార్టప్ కంపెనీ సీటెల్ లోని ఏరోటెక్ అనే ఏరో స్పెస్ ఇంజినీరింగ్ అండ్ సర్టిఫికేషన్ సంస్థతో కలసి పనిచేస్తోంది.